-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label జాక్‌ పూనెన్‌. Show all posts
Showing posts with label జాక్‌ పూనెన్‌. Show all posts

6 April 2020

దేవుడు ఆయనయందు ఆనందించెను


యేసునకు 30 సంవత్సరములు వచ్చినప్పుడు, పరలోకమునుండి తండ్రి ఆయనను గూర్చి ఈ మాటలు పలికాడు, ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను'' (మత్తయి 3:17). అప్పటికి ప్రభువైన యేసు ఒక అద్భుతముగాని లేక ఒక ప్రసంగము గాని చేయలేదు.

కాని దేవుడు ఆయనను అంగీకరించుటలో ఉన్న రహస్యమేమిటి? ఆయన బహిరంగ పరిచర్య ఆరంభించలేదు కాబట్టి ఆయన పరిచర్యనుబట్టి కూడా కాదు. కాని 30 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితమునుబట్టి మాత్రమే.

మనము కూడా మన పరిచర్యలోని అభివృద్ధినిబట్టి కాదుకాని మన నిజజీవితములో శోధించబడినప్పుడు నమ్మకముగా ఉన్నదానినిబట్టి దేవునిచేత అంగీకరించబడతాము. యేసుయొక్క 30 సంవత్సరాల రహస్యజీవితములో (దేవాలయములోని సంఘటన తప్ప) రెండు విషయములున్నవి- ''ఆయన అన్ని విషయములలో మనవలె శోధింపబడినను పాపము చేయలేదు'' (హెబ్రీ 4:15) మరియు ''ఆయన తన్నుతాను సంతోషపరచుకొనలేదు'' (రోమా 15:3).

ప్రతి సమయములో ఆయన శోధనను నమ్మకముగా ఎదిరించాడు మరియు ఏ విషయములో కూడా ఆయన తన సొంతమును కోరలేదు. ఇదియే తండ్రిని ఆనందింపచేసినది.

మన బాహ్యమైన అభివృద్ధిని, లోకస్థులు మరియు శరీరసంబంధమైన విశ్వాసులు గుర్తించవచ్చును కాని దేవుడు మన గుణశీలమునుమాత్రమే గుర్తిస్తాడు. మన గుణశీలము మాత్రమే దేవుని యొక్క అంగీకారమును తెచ్చును. మన విషయములో దేవుని అభిప్రాయము తెలుసుకొనవలెనంటే, మనము ఎంత పరిచర్య చేసామనేది మరచి, పాపము విషయములో మరియు స్వార్థము విషయములో మన తలంపులగూర్చి ఆలోచించాలి. అది మాత్రమే మన ఆత్మీయస్థితికి కొలబద్ద (ఆవిధముగా మాత్రమే మన ఆత్మీయ స్థితిని తెలుసుకొనగలము).

ఆవిధముగా లోకమంతటా తిరిగి స్వస్థపరచి మరియు బోధించే వానికిని మరియు కేవలము ఇంటిలోనే పనికలిగియుండే తల్లికిని, దేవుని మెప్పును (అంగీకారమును) పొందుటకు సమాన అవకాశము కలదు.

ఇప్పుడు క్రైస్తవులలో మొదటిగా ఉన్నవారు అనేకులు క్రీస్తు తీర్పు సింహాసనము ఎదుట కడపటివారగుదురు. ఎవరైతే ఇప్పుడు తాము కడపటివారమనుకుంటారో (గుర్తింపుపొందిన పరిచర్య వారికి లేదుకాబట్టి వారు మొదటివారగుదురు.                
       - జాక్‌ పూనెన్‌

21 March 2020

దినదినము రూపాంతరము పొందుట



నిరాకారముగాను, శూన్యముగాను, అంధకారముతోను చెడిపోయిన భూమిని చాలా మంచి దానిగా మార్చుటను గూర్చి ఆదికాండము 1వ అధ్యాయములో చదివెదము. ఆ అధ్యాయము ఆఖరికి వచ్చేసరికల్లా, భూమి మరొకసారి చాలా సుందరమైనదిగా మార్చబడినది. దానిని దేవుడే స్వయముగా చూచి, ''ఇది చాలా మంచిది'' అన్నాడు.

ఆదికాండము ఒకటవ అద్యాయములో మనందరికి ఒక వర్తమానము ఉన్నది. 2వ వచనములో ఉన్నట్లు, సాతాను మానవునిలోనికి వచ్చి అతనిని కూడా నిరాకారముగాను, శూన్యముగాను చేసి మరియు అంధకారము (చీకటి)లోనికి నడిపించాడు. మనము దేవుని స్వరూపమును కోల్పోయాము. దేవుడు ఆదామును ఆయన స్వరూపములో సృష్టించాడు. కాని సాతాను వచ్చి అతనిని నాశనము చేశాడు. అయితే దేవుడు మానవుని మరల నూతనసృష్టిగా చేయుటకు ఆరంభించియున్నాడు.

ఈనాడు నశించిన మానవజాతిని నూతనసృష్టిగా చేయుపనిలో దేవుడు ఉన్నాడు. నీవు ఎంతటి నిరాకారములో ఉన్నప్పటికీ, ఎంతటి అంధకారములో ఉన్నప్పటికీ లేక ఎంతటి శూన్యములో ఉన్నప్పటికీ పరవాలేదు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయగలడని ఆదికాండము 1వ అధ్యాయము చెప్పుచున్నది. ఆయన నిన్ను పరిపూర్ణముగా ఆయన సారూప్యములోనికి మార్చి మరియు ''చాలామంచిది'' అని నీ గురించి ఒక రోజు ఆయన చెప్పును. బైబిలులోని మొదటి అధ్యాయములో ఉన్న వర్తమానము ఇదియే.

కాని ఈ మార్పు ఎలా వచ్చింది? ఇది ఎలా జరిగిందో నీవు అర్థము చేసికొనినచో, అది నీ జీవితములో కూడా జరుగును.

ప్రతిరోజు దేవుడు, ఆయన వాక్యము ద్వారా మాట్లాడెను. రెండవరోజు మాట్లాడాడు. ప్రతి రోజు మాట్లాడెను. బైబిలులోని మొదటి అధ్యాయములో మనము దానిని చూడవలసిన అవసరమున్నది. అదేమనగా మన దేవుడు జీవముగల దేవుడైయున్నాడు మరియు ఆయన మాట్లాడును. నీవు క్రీస్తు సారూప్యములోనికి రూపాంతరము పొందుటకు, దేవుని వాక్యమును వినుట చాలా ముఖ్యమైయున్నది. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదుగాని దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును'' (మత్తయి 4:4). మానవుడు ఆవిధముగా జీవించాలని దేవుడు సంకల్పించియున్నాడు. కాబట్టి మనము ప్రతిరోజు ఆయన స్వరము విననట్లయితే, మనము రూపాంతర (నూతన) పరచబడము.

దేవునియొద్దనుండి వినుటను మనము అలవాటు చేసుకోవాలి. దేవుడు ప్రతిరోజు మాట్లాడును. కాని చాలామంది విశ్వాసులు ఆయననుండి వినరు. ప్రతిరోజు బైబిలు చదివేవారు కూడా కొందరు దేవుని నుండి వినరు. దేవుని నుండి వినటం అంటే కేవలము బైబిలు చదవటము కాదు. కథల పుస్తకము లేక రసాయన శాస్త్రము చదివినట్లు బైబిలు కూడా చదవవచ్చును. అయినప్పటికీ దేవుడు నీ హృదయముతో మాట్లాడాలనుకొనేది నీవు ఎన్నటికి వినకపోవచ్చును.

ఆదికాండము 1:2లో ఇంకొక విషయము చూస్తాము. అది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. నీవు దేవుని నుండి వినిన తరువాత, పరిశుద్ధాత్మ నీలో పనిచేయుటకు నీవు సహకరించాలి. అప్పుడు మాత్రమే నీవు నూతనపరచబడెదవు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యముతో కలిసి పని చేయుటను మనము ఆరంభమునుండి చూస్తున్నాము. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనిషిని రూపాంతరపరచగలడు. దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు కలిసి పని చేయుట వలన అధ్వాన్నముగా ఉన్న భూమి చాలా మంచిదిగా మార్చబడినది.

క్రైస్తవ్యములో ఈనాడు సమతుల్యత అత్యవసరము. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యము చదువుటకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుటను గూర్చి చెప్పరు. పరిశుద్ధాత్మ మీద నీవు ఆధారపడకుండా కేవలము దేవుని వాక్యము ధ్యానించినట్లయితే నీవు ఎముకవలె ఎండినవాడిగా ఉండి మరియు చనిపోయినవాని వలె ఉందువు. కొందరు పరిశుద్ధాత్మ పరిచర్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి కేవలము ఉద్రేకముతో ఉండి, అదే పరిశుద్ధాత్మ పరిచర్య అనుకొని మరియు వాక్యమును నిర్లక్ష్యముచేసి పొరబడుచున్నారు. వారు పట్టాలు తప్పిన స్టీము (రైలు) ఇంజను వలె చాలా శబ్దము చేయుచున్నారుగాని దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసినందున ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుటలేదు.


- జాక్‌ పూనెన్‌

13 May 2019

మోషేకు దేవుడిచ్చిన మూడు సూచనలు



మోషేకు దేవుడిచ్చిన మూడు సూచనలు......

నిర్గమకాండము 4: 1,2
*అందుకు మోషేచిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరుయెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా*
*యెహోవానీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడుకఱ్ఱ అనెను.*

నిర్గమకాండము 4వ అధ్యాయములో దేవుడు మోషేను పిలుచుట గూర్చి చదువుతాము. మోషేను ప్రోత్సహించి మరియు అతనికి బోధించుటకు మూడు సూచనలు దేవుడు అనుగ్రహించాడు.

*''నేను చెప్పునది వారు నమ్మరని''* మోషే దేవునితో చెప్పినప్పుడు, నీ చేతిలో ఏమున్నదని ఆయన అడిగాడు. దీనిని గమనించండి.

👉 *మన చేతిలో ఇప్పటికే ఉన్నదానితో దేవుడు ఎల్లప్పుడు ఆరంభిస్తాడు.*

 మనకు లేనిదానికొరకు మనము చూడనవసరము లేదు విధవరాలిని ఎలీషా ఇట్లడిగాడు, *''నీ యింటిలో ఏమున్నది?''* నూనె కుండ ఉన్నదని ఆమె చెప్పింది (2రాజులు 4:2,3).

*మోషే చేతిలో కఱ్ఱ మాత్రమే యున్నది. అది చాలును. దేవుడే నీతో ఉన్నట్లయితే, కఱ్ఱతో కూడా అద్భుతములు జరుగును.*

1⃣ *మొదటి సూచన* -
 *కఱ్ఱను నేలపడవేయుమని మోషేతో దేవుడు చెప్పాడు. అది పాముగా మారింది. మోషే దానినుండి పారిపోయాడు.* (నిర్గమకాండము 4:3).

 *''భయపడవద్దు నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమని''* దేవుడు చెప్పాడు. అతడు దానిని పట్టుకొనగా, అది మరలా కఱ్ఱగా మారింది.

👉 ఇక్కడ మనకున్న సందేశమేమిటి?
*కఱ్ఱ మోషేకు ఎంత సన్నిహితముగా ఉన్నదో సాతాను మనకు అంత సన్నిహితముగా ఉన్నాడు.*

🔹 సతాను మనకు ఎంతో దూరములో ఉన్నాడని నీవనుకొనుచున్నావా? కాదు. భార్యభర్తల మధ్య, పరిచారకుల మధ్య మొదలగువారి మధ్య మనస్పర్థలు వచ్చేటట్లు చేస్తాడు. కాని మనము సాతానుని జయించవచ్చును. అతడు ఇప్పటికే నశింపచేయబడి ఓడిపోయాడు.

కాబట్టి మనము అతనికి భయపడము. దేవుడు అతనిని మన పాదముల క్రింద త్రొక్కిపెట్టును. మనము ప్రభువును సేవించునప్పుడు, మొదటిగా మనము నేర్చుకొనవలసిన పాఠము, *''సాతానుకు భయపడకూడదు''.*  సాతానుకు కోట, దుర్గము ఉన్నది కాని మనము అతని నుండి పారిపోము.

*మనము యౌవనేచ్ఛల నుండి పారిపోవాలి.* (2తిమోతి 2:22). అయితే *సాతాను మనయొద్దనుండి పారిపోతాడు.*
 (యాకోబు 4:7).

👉సతాను ఏ నామమును బట్టి మనలను భయపెట్టాలనుకుంటాడో ఆ సర్వశక్తిగల శ్రేష్టమైన యేసునామమే, సముద్రములను రెండు పాయలుగా చేసి, దేవుని ప్రజలు ముందుకు వెళ్ళుటకు మన చేతిలో కఱ్ఱగా ఉండును.

*దేవుని సేవకులముగా మనకు మొదటిగా బైబిలు జ్ఞానముకాదు గాని దేవునియొక్క పునరుత్థాన శక్తి, అధికారము కావాలి.*

 నేను ఏ రోజైనా బైబిలు జ్ఞానము కంటే ఆత్మీయ శక్తి(జీవింపచేసే పరిశుద్ధాత్మ శక్తి)ని కలిగియుంటాను. మోషేకు మొదటిగా శత్రువు మీద అధికారము కావాలి. తన దాసుడైన ఫరో ద్వారా సాతాను, ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొనుటకు ప్రయత్నించియున్నాడు. కాబట్టి భయపడకుండా దాని తోక పట్టుకొని లేపాడు. *సాతానును గూర్చి మనమెప్పటికీ భయపడకూడదు.*

2⃣ *రెండవ సూచన*-

*దేవుడు మోషేతో నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమని చెప్పాడు.* (6వ).

మోషే తన చెయ్యిపెట్టి, తీసిన తరువాత ఆ చెయ్యి కుష్టుగలదాయెను.

👉 *దేవుని సేవకులముగా మనము తెలుసుకొనవలసిన రెండవ విషయము మన శరీరమందు మంచిది ఏదియు నివసించదు.* (రోమా 7:18).

*స్వార్థము మరియు భ్రష్టత్వము మన శరీర (ప్రాచీన స్వభావ)మంతటిలో ఉన్నది. నీవు ఇది నిజము కాదనుకొనినచో, నిన్నునీవే పరీక్షించుకొనుము.*

 నీలో ఉన్న కుష్టురోగము గురించి నీకు వెలుగు దయచేయుమని దేవునికి ప్రార్థించుము. నీవు ఈ పాఠము నేర్చుకోనట్లయితే, ఇతరులు నీకంటే చెడ్డవారని వారిని ఖండించే అవకాశమున్నది. మనము చేయలేని పాపమేదియు ఇతరులు చేయరు.

*వారు చేసిన పాపము మనము చేయలేదంటే దానికి కారణము కేవలము దేవుని కనికరము మరియు వారికి వచ్చినంతగా మనకు శోధన రాకపోవడము. మనము ఏ మనిషి కంటే కూడా మంచివారముకాదు. ఈ లోకములో ఉన్న ఏఒక్క వ్యక్తికంటే కూడా నీవు మంచివాడవనుకుంటే దేవుని సేవకు నీవు అనర్హుడవు.*

3⃣ *మూడవ సూచన*-

*కొంచెము ఏటినీళ్ళు తీసుకొని ఎండిననేల మీద పోయగా రక్తమగును.* (9వ).

 నైలునది ఐగుప్తీయులకు ఇష్టదేవత మరియు రక్తము మరణానికి సాదృశ్యము. దీనియొక్క ఆత్మీయ అర్థమేమిటనగా
*ఈ లోకస్తులు ఆశపడి వెంటాడి మరియు ఆరాధించే ఈ లోకసంబంధమైనవన్నియు చివరకు మరణాన్ని తెస్తాయి.*

👉 *ఒకదైవసేవకునకు లోకమును లోకమునకు అతడును సిలువ వేయబడియున్నారు. ఈ లోకము, నాకు అత్యవసరమైన జీవజలనదికాదు కాని రక్తమైయున్నది. కాబట్టి అది త్రాగవలెననే శోధన కూడా నాకురాదు. ఈ లోకములోని సమస్తమును మనము ఆవిధంగా చూడాలి.*                                          
 
*జాక్‌ పూనెన్*

4 March 2019

గర్వము వ్యభిచారము కంటే అపాయకరమైనది - జాక్‌ పూనెన్‌


గర్వము వ్యభిచారము కంటే అపాయకరమైనది

ఎదోముమీద దేవుని తీర్పును గురించి ఓబద్యా మాట్లాడెను. ఎదోము మన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. గనుక ఈ ప్రవచనము మన శరీరము యొక్క పతనమును గూర్చి సూచించుచున్నది.

ఎదోము యొక్క గర్వము గురించి ఇక్కడ చెప్పబడి యున్నది. ''అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడవు''. నన్ను క్రిందకు పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును (ఓబద్యా 1:3,4).

శరీరము ఎల్లప్పుడు తన్నుతాను హెచ్చించుకొనుటను కోరును. కాని ఆ గర్వమంతటినీ పూర్తిగా నాశనము చేయుటకు దేవుడు నిర్ణయించెను. దొంగలు రాత్రివేళ వచ్చినట్లయితే వారు సమస్తమును దొంగిలించలేరు. కాని ఇక్కడ ''వారి సొమ్ము సోదా చేయబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును''. దీని భావము ఆత్మచేత ''శరీరానుసారమైన'' సమస్తమును, శరీరయిచ్ఛలును పూర్తిగా నాశనము చేయబడును.

యాకోబు సంతతి బంధీలుగా పట్టబడి గొప్ప అవసరములో ఉన్నప్పుడు తమ సొంత బంధువులైన వారిని బలాత్కారము చేసినందున, దేవుడు ఎదోమును శిక్షించెను, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలసికొంటివిగదా అనెను (ఓబద్యా 1:10,11). ఇశ్రాయేలీయుల శత్రువుల వలె వారు పని చేసిరి. ఇశ్రాయేలుకు సహాయపడుటకు ఎదోము ఏమియు చేయలేదు.

చేయవలసినవి చేయకపోవుట మరియు చెయ్యకూడనివి చేయుట అను పాపములు ఉన్నవి. తరచుగా మనము పాపములను గూర్చి తలంచినప్పుడు, కేవలము చేసిన పాపములను మాత్రమే తలంచెదము. గమనించండి. మంచిసమరయుని కథలో యాజకుడు మరియు లేవీయుడు పాపము చేయలేదు. పడియున్న వ్యక్తిని వారు కొట్టలేదు. అవసరములో ఆ వ్యక్తికి వారి చేతివ్రేలితో కూడా సహాయపడకపోవడమే పాపము. అవసరములో ఉన్న వ్యక్తికి సహాయపడకపోవడము పాపమని మీరు గుర్తించుచున్నారా? అది చేయవలసినది చేయకపోవడమనే పాపము.

 ఎదోము చేయవలసినది చేయలేదు- దానిని ప్రభువు తీవ్రముగా తీసుకొనెను. ఇశ్రాయేలీయుల శ్రమను చూచి సంతోషించుట ఎదోము చేసిన రెండవపాపము (ఓబద్యా 1:12). నీకు ఇష్టములేని వారికి శ్రమ కలిగినప్పుడు, నీవు సంతోషించుచున్నావా? అది పాపము. ఇతరుల శ్రమలను బట్టి మనము సంతోషింపకూడదు. కాని అది మాత్రమే కాదు నిస్సహాయులైన ఇశ్రాయేలీయులను సంహరించుటకు ఎదోమీయులు అడ్డత్రోవలలో నిలిచిరి (ఓబద్యా 1:14). వారు ఇశ్రాయేలీయుల శత్రువులకు సహకరించిరి. చివరకు ఇశ్రాయేలీయులు స్వతంత్రులగుదురని ప్రభువు చెప్పెను. దాదాపు ప్రతి ప్రవక్త మళ్ళీ స్థాపించబడటము గూర్చి చెప్పిరి.

ఒకరోజు ''తప్పించుకొనిన వారు యెరూషలేములో నివసింతురు'' (ఓబద్యా 1:17). అది ప్రతిష్టిత స్థలమగును. యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఆ సమయమున యాకోబు సంతతివారు అగ్నియు, ఏశావు సంతతివారు కొయ్యకాలగుదురు మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండమీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును (ఓబద్యా 1:21). దిగజారిన దేవుని ప్రజలకు ''ఇదిగో మీ రాజు'' అని ప్రకటించి మరియు వారిని వెనుకకు పిలచుటకు రక్షకులుగా ఉండుటకు దేవుడు మనలను పిలచెను.

ఎదోము పతనమగుటకు కారణమేమిటి? ''నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి'' (ఓబద్యా 1:3). గర్వము, సాతాను స్వభావమైయున్నందున మనము గర్వించినప్పుడు ఆత్మీయ మోసమునకు ద్వారము తెరచినట్లగును. నీకున్న అందమును బట్టి, తెలివితేటలను బట్టి, ఆత్మీయతనుబట్టి, బైబిలు జ్ఞానమును బట్టి, మరిదేని గూర్చి యైనను నీవు గర్వించిన వెంటనే సాతాను నీ మీదకువచ్చి ఇప్పుడు ''నీవు మరియు నేను సహవాసము కలిగియున్నామని చెప్పును''. మరొకవైపున యేసు, భూమి మీద మనుష్యులందరిలో దీనుడైయున్నాడు మరియు నిన్ను నీవు తగ్గించుకొనిన వెంటనే ఆయనతో సహవాసము కలిగియుందువు.

వ్యభిచారము బహిరంగపాపము గనుక వ్యభిచారము కంటే గర్వమే అపాయకరమైనది మరియు బహిరంగ పాపములు రహస్య పాపముల కంటె అపాయకరమైనవి కావు. వారి గర్వములో సంతోషించువారు మోసపోయెదరని ఓబద్యా వారిని హెచ్చరించుచున్నాడు. శరీరెచ్ఛల బంధకాలలో మన చుట్టూ ఉన్నవారికి, ప్రభువైన యేసు వారిని పూర్తిగా విడిపించగలడని ప్రకటించుటకు ఈ క్లుప్తమైన హెచ్చరికనుండి మనము నేర్చుకొనెదము గాక.                           - జాక్‌ పూనెన్‌


నీవు అత్యవసరము కాదని గుర్తించుట - జాక్‌ పూనెన్‌


నీవు అత్యవసరము కాదని గుర్తించుట

క్రీస్తు సంఘములో ఎవరు అత్యవసరము కాదు. మనము లేకున్నప్పటికీ దేవుని పని సులభముగా జరుగును. నిజానికి, తాము అత్యవసరమని అనుకొనువారు లేనప్పుడు దేవుని పని చాలా మంచిగా జరుగును. ఈ సంగతిని మనమెల్లప్పుడు గుర్తించవలెను. తాను ''అత్యవసరము'' అని అనుకొనువాడు దీనుడగుటకు ఒక ఆజ్ఞను ఒకసారి చదివితిని. అతడు ఒక బకీటును నీటితో నింపి తన చేతులను మణికట్టు వరకు ముంచి మరియు బయటకు తీయవలెను తరువాత ఆ నీటిలో ఎంత రంధ్రము ఉన్నదో, అంత అతడు లేనప్పుడు కొదువ ఉండును.

మనకున్న వరములు సంఘమునకు ఉపయోగకరమే కాని ఎవరు (ఏ ఒక్కరు) అత్యవసరము కాదు. ఎప్పుడైననూ దేవుడు మనలను వెనుకకు పిలిచినయెడల వెనుదిరుగుటకు ఇష్టపడవలెను. కాని తన కొరకే తాను బ్రతికే క్రైస్తవ పనివాడు దానిని ఎన్నటికీ అంగీకరించడు. తనకున్న పదవి సాధ్యమైనంత ఎక్కువ కాలము ఉండవలెనని దానిని పట్టుకొనును. అటువంటి అనేక ''క్రైస్తవ నాయకులు'' దేవుని పనికి ఆటంకముగా వారి సింహాసనముల మీద ఉంటున్నారు (కంపుకొట్టుచున్నారు). వారి స్థానమును వేరేవారు తీసుకొనునట్లు కనికరముతో వెనుకకు వెళ్ళుట వారికి తెలియదు.

దానిని కొనసాగించు మరియొకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను సామెత ఉన్నది. యేసు దీనిని ఎరుగును గనుక ఆయన పనిని కొనసాగించుటకు ప్రజలకు తర్ఫీదు నిచ్చెను. తన పరిచర్య మీద నాయకత్వము వహించుటకు ఇతరులకు 3 1/2 సంవత్సరములలో తర్ఫీదు ఇచ్చెను. మనము వెంబడించుటకు ఇది ఎంత గొప్ప మాదిరి?

తన పరిచర్యను కొనసాగించుటకు ఇతరులకు తర్ఫీదు ఇవ్వవలసిన అవసరమును పౌలు గుర్తించెను. 2తిమోతి 2:2లో తిమోతితో ఇట్లనెను: ''నీవు అనేక సాక్షుల యెదుట నా వలన వినిన సంగతులను బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు (నాలుగవ తరము) అప్పగింపవలెను''. ఇక్కడ పౌలు చెప్పుచున్నదేమిటి అనగా ''ఈ సంపదను ఇతరులకు అప్పగించవలెను. నీ కంటే చిన్న వారి యొక్క అభివృద్ధికి ఎప్పుడైననూ నీవు ఆటంకముగా ఉండవద్దు''.

''దానిని కొనసాగించుటకు మరియొకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను'' నియమమును వ్యాపారస్తులు కూడా గుర్తించియున్నారు. కాని చాలా మంది క్రైస్తవనాయకులు దీనిని గుర్తించుట లేదు. నిజముగా ''వెలుగు సంబంధులకంటే ఈ లోకసంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులైయున్నారు'' (లూకా 16:8).

ఒక మనుష్యుడు తన కంటే చిన్నవాడు, పనులను తనకంటే బాగుగా చేసినప్పుడు కేవలము అతనిలో సామర్థ్యమును బట్టి అసూయపడును. దేవుడు కయీనును విడిచి హేబెలును అంగీకరించినప్పుడు అతడు అసూయపడెను. హేబెలు తనకంటే పెద్ద వాడైనట్లయితే సహించగలిగి యుండెడివాడేమో. తన తమ్ముడు తన కంటే యోగ్యుడను సత్యము, తన తమ్ముడైన హేబెలును చంపునట్లుగా చేసెను.

యోసేపు మరియు అతని సహోదరుల విషయములో కూడా దీనిని చూచెదము. యోసేపు దేవుని ప్రత్యక్షతలు పొందెను మరియు దానిని బట్టి తన పదిమంది అన్నలు తన మీద అసూయపడి అనగా అతనిని చంపునంతగా అసూయపడిరి.

''సౌలు వేల మందిని చంపెను కాని దావీదు పదివేల మందిని చంపెను'' అని స్త్రీలు పాడినప్పుడు సౌలురాజు తన కంటె చిన్నవాడైన దావీదు మీద అసూయపడెను. ఆ రోజునుండి దావీదును చంపుటకు నిర్ణయించుకొనెను. అయ్యో! మానవ చరిత్ర అంతయు, క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా ఈవిధముగా మరల మరల జరిగినట్లు చూచుచున్నాము. అదే విధముగా పెద్దలైన పరిసయ్యులు యవ్వనస్థుడైన నజరేయుడగు యేసును చూచి అసూయపడి మరియు ఏ విధముచేతనైనను ఆయనను చంపవలెనని తీర్మానించుకొనిరి.

మరొక వైపున క్రొత్త నిబంధనలో బర్నబా వంటి వ్యక్తిని చూచుట చాలా ఆహ్లాదముగా ఉన్నది. పౌలును ఎవరు అంగీకరించనప్పుడు, బర్నబా ఒక పెద్ద పరిచారకుడైయుండి క్రొత్తగా మారుమనస్సు పొందిన పౌలును తీసుకొని వెళ్లెను. అతడు పౌలును అంతియొకియ సంఘమునకు తీసుకొని వచ్చి మరియు అతనిని ప్రోత్సహించెను. అపొస్త్తలుల కార్యములు 13వ అధ్యాయములో, బర్నబా మరియు పౌలు కలసి సువార్త పరిచర్య నిమిత్తము వెళ్ళెనని చదివెదము. కాని దేవుడు తనకంటే చిన్నవాడైన పౌలును పెద్ద పరిచర్యకు పిలిచియున్నాడని చూచినప్పుడు తనకు తానుగా వెనుకకు తగ్గి మరియు కనికరముతో కనుమరుగయ్యెను (వెనుకకు వెళ్ళెను). అపొస్త్తలుల కార్యములలో ''బర్నబా మరియు పౌలు'' అను మాట ఇప్పుడు ''పౌలు మరియు బర్నబా''గా మారుట గమనించగలము. ఈవిధముగా వెనుకకు వెళ్ళి మరియు ఇతరులు గౌరవము పొందునట్లు చేయు బర్నబాలు చాలా కొద్దిమంది ఉండుట వలన ఈనాటి క్రైస్తవ సంఘము నష్టపోవుచున్నది.

 ప్రాముఖ్యత లేని విషయములలో మనము వెనుకకు తగ్గుటకు ఇష్టపడెదము. ఉదాహరణకు ఒక ద్వారము గుండా వెళ్ళునప్పుడు, మనము ప్రక్కకు వెళ్ళి వేరే వాళ్ళను పోనిచ్చెదము. కాని క్రైస్తవసంఘములోని పదవి మరియు నాయకత్వము విషయములో, వెనుకకు వెళ్ళుటకు మనము సిద్ధముగా లేము. మన స్వార్థము ఎంతో మోసకరమైనది. విలువలేని విషయములలో మనము నకిలీ దీనత్వమును కలిగియుండవచ్చును. కాని విలువగల విషయములోనే మనమేమైయున్నామనునది చూడగలము.                                                                                - జాక్‌ పూనెన్‌

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics