-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

2 April 2018

మరణం తరువాత


మరణం తరువాత ఏమిటి?....✍


క్రైస్తవ విశ్వాసులలోనే, మరణం తరువాత ఏమి జరుగుతుంది అను విషయమును గూర్చి గొప్ప సందిగ్ధం ఉంది.

👉మరణం తరువాత ఆఖరి తీర్పు వరకు అందరు “నిద్రిస్తారు,” ఆ తరువాత అందరు పరలోకానికి లేక నరకానికి పంపబడతారని కొందరు నమ్ముతారు.

👉మరణించిన వెంటనే ఒకనికి తీర్పుతీర్చబడి పరలోకానికి లేక నరకానికి పంపబడతారు అని మరికొందరు నమ్ముతారు.

 మరణించిన తరువాత ప్రజల యొక్క ప్రాణములు/ఆత్మలు “తాత్కాలిక” పరలోకం లేక నరకంలోనికి పంపబడి, ఆఖరి పునరుత్ధానం, ఆఖరి తీర్పు, మరియు వారి యొక్క నిత్య గమ్యము యొక్క తీర్పు కొరకు ఎదురుచూస్తారు.

👉  కాబట్టి, మరణం తరువాత ఖచ్చితంగా ఏమి జరుగుతుందని బైబిల్ చెబుతుంది?

♻ యేసు క్రీస్తు యొక్క విశ్వాసి కొరకు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా వారి పాపములు క్షమించబడెను కాబట్టి, మరణం తరువాత వారి ఆత్మలు/ప్రాణములు పరలోకానికి తీసుకొని పోబడతాయని బైబిల్ చెబుతుంది (యోహాను 3:16, 18, 36).

👉 విశ్వాసులకు మరణం అనగా
“శరీరమును వెడలిపోయి క్రీస్తుతో ఉండెదను” (2 కొరింథీ. 5:6-8; ఫిలిప్పీ. 1:23).
 అయితే, విశ్వాసులు పునరుత్ధానం పొంది మహిమగల శరీరములు పొందుకుంటారని 1 కొరింథీ. 15:50-54 మరియు 1 థెస్స. 4:13-17 వివరిస్తుంది.

👉మరణం అయిన వెంటనే విశ్వాసులు క్రీస్తుతో ఉండుటకు వెళ్తే, ఈ పునరుత్ధానం యొక్క ఉద్దేశము ఏమిటి? విశ్వాసుల యొక్క ఆత్మలు/ప్రాణములు మరణం అయిన వెంటనే క్రీస్తు యొద్దకు వెళ్తే, భౌతిక శరీరము సమాధిలో “నిద్రిస్తుంది” అనిపిస్తుంది.

👉విశ్వాసుల యొక్క పునరుత్ధానంలో, భౌతిక శరీరం పునరుత్ధానం పొందుతుంది, మహిమ పొందుతుంది, మరియు ఆత్మ/ప్రాణముతో మరలా జతపరచబడుతుంది. ఈ మరలా జతపరచబడిన మరియు మహిమపరచబడిన శరీరం-ప్రాణం-ఆత్మ నూతన ఆకాశం మరియు నూతన భూమిలో నిత్యత్వం వరకు విశ్వాసుల యొక్క స్వాస్థ్యం అవుతుంది (ప్రకటన 21-22).


🔺1కోరింథీయులకు 15:44
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

🔺మరొక వాక్యభాగమును పరిశీలించిన యెడల మన యేసయ్య, మృతులలో నుండి మొట్టమొదటి సారిగా మహిమ గల శరీరముతో లేపబడినవాడు అని స్పష్టం అవుతుంది.

కొలస్సీయులకు 1:18:
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

1 కోరింథీయులకు 15: 42, 43:
మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

👉 కనుక యేసయ్య ఏ విధముగా చనిపోయి, మహిమ గల శరీరముతో తిరిగి లేపబడ్డాడో
అదే విధముగా మనము కూడా చనిపోయి మహిమ గల శరీరముతో తిరిగి  పైకి లేపబడుదుము.
 ఏలయనగా యేసయ్య మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడు (కొలస్సీయులకు 1:18) . ఆయన మనందరికీ సాదృశ్యం అయి ఉన్నాడు.

👉ఆయన ఎలాంటి మహిమ గల ధరించాడు అని బైబిల్ గ్రంధమును మనం పరిశీలించినట్లయితే

యోహాను 20:26, 27
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

🔹1). తోమా యేసయ్యను గుర్తు పట్టగలిగినట్లు, మనము కూడా ఇతరులచే గుర్తుపట్టగలం.

🔹2). తలుపులు మూయబడి వున్నా కూడా యేసయ్య గదిలోనికి ఏ విధముగా రాగలిగాడో , అదే విధముగా మనము కూడా ప్రవేశించగలం.

🔹3). యేసయ్యకు శిలువ మరణము వలన కలిగిన గురుతులు వలె, మనము కూడా భౌతికపరమైన గురుతులు కలిగి ఉండగలము.

👉  శరీరములను ధరించుకొంటాము అనగా
ఈ లోక సంభంధమైన శరీరము కాదు, మహిమ గల  అక్షయమైన శరీరము ధరించుకొంటాము అని రూడిగా మన హృదయములో  బద్రపరుచుకోవాలి.

1కోరింథీయులకు 15:44:
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.

♻ క్రీస్తును రక్షకునిగా అంగీకరించనివారికి, మరణం అనగా నిత్య శిక్ష అవుతుంది.
 అయితే, విశ్వాసుల వలెనే, అవిశ్వాసులు కూడా ఆఖరి పునరుత్ధానం, తీర్పు, మరియు నిత్య గమ్యము కొరకు తాత్కాలిక స్థలమునకు పంపబడతారు. ధనవంతుడు మరణించిన వెంటనే హింసించబడెను అని లూకా 16:22-23 వర్ణిస్తుంది.

అవిశ్వాసులుగా మరణించిన వారందరు తిరిగి లేచి, గొప్ప శ్వేత సింహాసనం యొద్ద తీర్పును పొంది, తరువాత అగ్ని గుండమునకు పంపబడతారని ప్రకటన 20:11-15 వివరిస్తుంది.

👉 అనగా, అవిశ్వాసులు మరణం తరువాత వెంటనే నరకంలోనికి (అగ్ని గుండములోనికి) పంపబడరుగాని, తీర్పు మరియు శిక్ష అను తాత్కాలిక స్థలంలో ఉంటారు.

👉అయితే, అవిశ్వాసులు వెంటనే అగ్ని గుండములోనికి పంపబడనప్పటికీ, మరణం తరువాత వారి గమ్యం అంత సుఖవంత కాదు. ధనవంతుడు, “నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని” కేకలు వేశాడు (లూకా 16:24).

👉కాబట్టి,
మరణం తరువాత, ఒక వ్యక్తి “తాత్కాలిక” పరలోకం లేక నరకంలో ఉంటాడు. ఆ తాత్కాలిక ప్రదేశం తరువాత, ఆఖరి పునరుత్ధానంలో, ఆ వ్యక్తి యొక్క నిత్య గమ్యం మార్చబడదు. ఆ నిత్య గమ్యం యొక్క ఖచ్చితమైన “స్థానం” మారుతుంది అంతే.

విశ్వాసులకు తుదకు నూతన ఆకాశం మరియు నూతన భూమిలోనికి ప్రవేశం లభిస్తుంది (ప్రకటన 21:1).

అవిశ్వాసులు తుదకు అగ్నిగుండములోనికి పంపబడతారు (ప్రకటన 20:11-15).

👉 ఇవి ప్రజలందరి యొక్క ఆఖరి నిత్య గమ్యాలు-వారు తమ రక్షణ కొరకు యేసు క్రీస్తుపై మీద మాత్రమే విశ్వాసం ఉంచారో లేదో అను దాని ఆధారంగా (మత్తయి 25:46; యోహాను 3:36).

♻ మరణం తరువాత జీవితము ఉందా ?

అనునది సార్వత్రిక ప్రశ్న.
“స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడక పోవునట్లు వాడు నిలువక పారిపోవును...మరణము తరువాత నరులు బ్రతుకుదురా?”
 అని అంటూ యోబు మనందరి కొరకు మాట్లాడుచున్నాడు (యోబు 14:1-2, 14).

👉మరణం తరువాత జీవితము మాత్రమే కాదు, మహిమ కరమైన నిత్య జీవము ఉన్నదని,
 “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు” (1 కొరింథీ. 2:9)
 అని బైబిల్ చెబుతుంది.

👉యేసు క్రీస్తు, శరీరధారియైన దేవుడు, నిత్య జీవమను ఈ బహుమతిని మనకిచ్చుటకు ఈ భూమి మీదికి వచ్చెను. “మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” యెషయా 53:5.

మనమంతా పొందవలసిన శిక్షను యేసు తనపై వేసుకొని మన పాపమునకు పరిహారం చెల్లించుటకు తన జీవితమును బలిగా ఇచ్చెను. మూడు దినములు తరువాత, సమాధి నుండి తిరిగిలేచుట ద్వారా మరణముపైన ఆయన విజయవంతుడని రుజువు చేసెను. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళుటకు ముందు నలభై దినములు భూమి మీద ఉండి వేల మందికి కనిపించెను.

“ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతుమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” అని రోమా. 4:25 చెబుతుంది.

 క్రీస్తు యొక్క పునరుత్ధానం చక్కగా లిఖించబడిన సన్నివేశం. దీని చెల్లుబాటును పరీక్షించుటకు సాక్షులను ప్రశ్నించమని అపొస్తలుడైన పౌలు ప్రజలను అడిగెను గాని, దాని సత్యమును ఎవరు ఎదురించలేకపోయిరి.

👉 పునరుత్ధానం క్రైస్తవ విశ్వాసమునకు మూలరాయిగా ఉన్నది.


👉క్రీస్తు మరణము నుండి తిరిగిలేచెను గనుక, మనము కూడ తిరిగి లేస్తామనే విశ్వాసం మనం కలిగియుండవచ్చు.

👉 యేసు యొక్క పునరుత్ధానం మరణం తరువాత జీవితానికి అంతిమ రుజువు.

👉మరణము నుండి తిరిగి లేచు వారి గొప్ప కోతకు క్రీస్తు ప్రథమ ఫలము మాత్రమే.

🔹 శారీరిక మరణం మనం అనుబంధం కలిగియున్న ఆదాము అను ఒకే పురుషుని ద్వారా వచ్చెను.
అయితే యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని కుటుంబములోనికి స్వీకరించబడిన వారందరికీ నూతన జీవితము ఇవ్వబడును
 (1 కొరింథీ. 15:20-22).

👉దేవుడు యేసు యొక్క శరీరమును లేపినట్లే, యేసు రాకడ వచ్చినప్పుడు మన శరీరములు కూడ లేపబడును (1 కొరింథీ. 6:14).

🔹మనమంతా తుదకు తిరిగి లేచినప్పటికీ,అందరు పరలోకానికి వెళ్ళరు.
ఈ జీవితములో ప్రతి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి,మరియు ఈ నిర్ణయం ఒకని నిత్య గమ్యమును శాసిస్తుంది.

👉మనమంతా ఒక మారు మాత్రమే మరణించవలసి యున్నదని, ఆ తరువాత తీర్పు వస్తుందని బైబిల్ చెబుతుంది (హెబ్రీ. 9:27).

క్రీస్తుయందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడినవారంతా పరలోకములోనికి నిత్యజీవమునకు వెళ్ళుదురు,

🔹 కాని క్రీస్తును రక్షకునిగా నిరాకరించినవారు నిత్య శిక్షలోనికి అనగా నరకము లోనికి పంపబడుదురు (మత్తయి. 25:46).

👉నరకము, పరలోకములానే, కేవలం నివసించు ఒక స్థితికాదు గాని,
🔹వాస్తవిక స్థలము.
🔹ఇది అనీతిమంతులు అంతముకానిది,
🔹దేవుని నిత్య ఉగ్రతను అనుభవించు స్థలము. నరకము అగాధముగాను (లూకా 8:31; ప్రకటన 9:1)
మరియు మండుచుండు అగ్ని గుండముగాను వివరించ బడెను, మరియు
🔹 ఇక్కడ ప్రజలు నిత్యము పగలు రాత్రి హింసించబడతారు
 (ప్రకటన 20:10).

🔹నరకములో గొప్ప దుఖమును కోపమును సూచిస్తూ, ఏడ్పులును పండ్లు కొరుకుటను ఉండును (మత్తయి. 13:42).

👉 దుష్టుల మరణము దేవునికి అయిష్టమైనది, అయితే వారు తమ దుష్ట మార్గముల నుండి వెనుకకు తిరిగి జీవించాలని ఆయన ఆశించుచున్నాడు (యెహే. 33:11).

👉 అయితే ఆయన మనలను లోపరచడు;
👉ఆయనను తిరస్కరించాలని మనం కోరినయెడల,
నిత్యత్వములో ఆయనకు వేరుగా జీవించాలని మనం తీసుకొను నిర్ణయమును ఆయన అంగీకరిస్తాడు.
👉భువిపై జీవితం ఒక పరీక్ష వంటిది,
👉ఇది రానున్న వాటికి సిద్ధపాటు.

విశ్వాసులకు, మరణము తరువాత జీవితము పరలోకములో దేవునితో నిత్యజీవము.

అవిశ్వాసులకు, మరణము తరువాత జీవితము అగ్నిగుండములో నిత్యత్వము.

👉మరణము తరువాత నిత్యజీవమును మనం ఎలా పొందగలము మరియు అగ్నిగుండములో నిత్యత్వమును ఎలా తప్పించుకొనగలము?

👉ఒకే మార్గమున్నది - యేసు క్రీస్తులో విశ్వాసము మరియు నమ్మిక. యేసు చెప్పెను, “పునరుత్ధానమును జీవమును నేనే; నాయందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు...” యోహాను 11:25-26.

👉నిత్య జీవమను ఉచిత బహుమానము అందరికీ అందుబాటులో ఉంది.

 “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును” (యోహాను 3:36).

మరణము తరువాత రక్షణ అను దేవుని ఉచిత బహుమానమును స్వీకరించుటకు మనకు అవకాశం ఉండదు.

👉మన భూలోక జీవితములలో యేసు క్రీస్తును అంగీకరించుట లేక తిరస్కరించుట మన నిత్య గమ్యమును శాసిస్తుంది.

 “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” (2 కొరింథీ. 6:2).

👉దేవునికి విరోధముగా మనం చేసిన పాపమునకు యేసు క్రీస్తు యొక్క మరణం పరిపూర్ణ పరిహారం అని మనం నమ్మిన యెడల,
మనం కేవలం ఈ లోకములో
 👉మాత్రమే అర్థవంతమైన జీవితము కలిగియుండముగాని,
👉 మరణము తరువాత క్రీస్తు యొక్క మహిమగల సన్నిధిలో నిత్యజీవము కలిగి యుందుము.

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics